Noorjahan Mango History: ఆదిలాబాద్ మార్కెట్లోకి ప్రత్యేకమైన 'నూర్జహాన్' మామిడి పండ్లు వచ్చాయి. ఒక్కో పండు రెండు నుంచి ఐదు కిలోల బరువుతో, ధర రూ. 800 నుంచి 1000 వరకు పలుకుతోంది. సైజులోనే కాదు, రుచిలోనూ ఈ రకం అగ్రస్థానంలో ఉందని మామిడి ప్రియులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ఈ ఖరీదైన మామిడి పండు, దాని భారీ ధర, ప్రత్యేకతలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.