Obulapuram Mining Case: గాలి జనార్ధన్ రెడ్డికి జైలు శిక్ష

10 months ago 34
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. సుదీర్ఘ కాలం సాగిన ఈ విచారణ తుది తీర్పును సీబీఐ కోర్టు వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చింది. ఇందులో A-1గా ఉన్న శ్రీనివాసరెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడగా.. మిగిలిన నిందితులకూ 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా కూడా విధించింది. కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్‌ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేశారని సీబీఐ కేసులు నమోదు చేసింది. 2009లో సీబీఐ ఈ వ్యవహారంలో విచారణ చేపట్టగా.. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకువచ్చారు. దాదాపు రెండేళ్లకుపైగా జైల్లో ఉన్న తర్వాత గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంను కూడా నిర్దోషిగా విడుదల చేసింది. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరు సురక్షితంగా బయటపడ్డారు.
Read Entire Article