మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ కేసులో వైఎస్ జగన్ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మరోవైపు సింగయ్య మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.