ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఆగంతకులు రెచ్చిపోయారు. పల్నాడు జిల్లా క్రోసూరులో ఆలయంపై దాడికి పాల్పడ్డారు. క్రోసూరులోని వెంకటేశ్వరస్వామి గుడిపై దాడి చేసిన దుండగులు.. విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను గుడిలో నుంచి బయట పడేశారు. గుడిలోని వస్తువులకు నిప్పటించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా .. శనివారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా చేశారా.. ఆకతాయిల పనా అనేదానిపై ఆరా తీస్తున్నారు.