అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ హెవీ లైన్ కరెంటు తీగ తెగిపడిపోవడంతో అగ్నిప్రమాదం జరిగింది. హెచ్డీ లైన్ కింద స్క్రాప్ షాప్ స్టాక్ ఉండడంతో మంటలు చెలరేగాయి. స్క్రాప్ షాప్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం ఫార్మా కంపెనీలకు ఆనుకొని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనకాపల్లి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి.