ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో సాగుతున్న ప్రయాణాన్ని ముంబయి లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. సొంత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు హిందీ భాష, తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారు.