ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మరోసారి జ్వరం వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే గత రెండు మూడు రోజుల నుంచి ఏపీ శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూపై చర్చ కోసం మంగళవారం రోజున పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చారు. సమావేశాలు ముగిసిన వెంటనే ఏపీ కేబినెట్ భేటీ జరగ్గా.. పవన్ కళ్యాణ్ మంత్రిమండలి భేటీకి దూరంగా ఉన్నారు. మరోవైపు మంత్రులు సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్ కూడా కేబినెట్ భేటీకి రానట్లు తెలిసింది.