డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లారీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వారాహి యాత్రలో గ్రీన్ టాక్స్ సమస్యను విన్న ఆయన, అధికారంలోకి రాగానే దానిని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో గ్రీన్ టాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి రూ.20 వేల వరకు చెల్లిస్తున్న గ్రీన్ టాక్స్ ఇకపై రూ.1,500 నుంచి రూ.3 వేలకు తగ్గనుంది. ఈ నిర్ణయంపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.