ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేవలం రెండు నెలల్లోనే తాను ఇచ్చిన హామీని అమలు చేశారు. ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ తమిళనాడులోని పళని ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి పళని మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని కొంతమంది భక్తులు పవన్ కళ్యాణ్ను కోరారు. ఆ మేరకు వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే గురవారం తిరుపతి పళని బస్సు సర్వీసును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంత్రి మండిపల్లితో కలిసి వీటిని ప్రారంభించారు.