Pithapuram Baby Murder: ఐదు నెలల చంపేసిన కన్నతల్లి, అమ్మమ్మ

1 year ago 29
కుటుంబం పరువు పేరుతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన కూతురుకు రెండో పెళ్లి చేయడానికి ఐదు నెలల పసికందును హత్య చేసింది. కన్న తల్లి కూడా ఈ దారుణానికి సహకరించింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడాన్ని అవమానంగా భావించిన మహిళ.. ఆమెకు పుట్టిన బిడ్డను అడ్డు తొలగించుకుంటే కూతురికి రెండో పెళ్లి చేయొచ్చని భావించింది. అలా అమ్మ, అమ్మమ్మ కలిసి ఐదు నెలల పసికందును చంపేసి బావిలో పడేశారు. చివరకు పోలీసుల విచారణలో అడ్డంగా దొరికి పోయారు. ఈ నెల 6న పసికందు యశ్వితను అన్నవరం, శైలజ కలిసి గొంతు నులిమి చంపేసి పక్కింట్లో ఉన్న బావిలో పడేశారు. పైగా క్షుద్రపూజలు చేసినట్టు నమ్మించేందుకు ఇంటిముందు పసుపు, కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టారు. పోలీసుల విచారణలో దొరికిపోయారు.
Read Entire Article