Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు వందల కొద్దీ సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే వరకు ఎక్కడెకక్కడికి వెళ్లారు.. ఎవరెవర్ని కలిశారు.. మధ్యలో ఎంతసేపు ఆగారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక ఆధారాలు సేకరించారు. ఇక రేపు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.