హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని, దీని కారణంగా జూలై 22 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో మెదక్ జిల్లా చేగుంటలో 2.85 సెం.మీ వర్షపాతం నమోదైందనట్లు తెలిపారు.