విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో ఓ కానిస్టేబుల్ అద్భుతంగా పాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైడితల్లి అమ్మవారి శత జాతరలో భాగంగా సంగీత కార్యక్రమం నిర్వహించారు. జాతరకు బందోబస్తు విధుల కోసం వచ్చిన కానిస్టేబుల్ వెంకటరమణకు కూడా స్టేజీ మీద పాడాలని అనిపించింది. దీంతో సీఐను పర్మిషన్ అడిగి.. భైరవద్వీపంలోని శ్రీతుంబుర నారద నాదామృతం పాట పాడగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.