Roja on Pawan kalyan over Union Budget: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో ఏపీ ఊసే ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ కూటమి సర్కారులో కీలకంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తేవటంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని విమర్శించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతగానితనం వలనే ఏపీకి నిధులు రాలేదని.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజా.. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సెటైర్లు గుప్పించారు.