భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోకి వరద నీరు చేరడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. ప్రయాణికులను ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. చాదర్ఘాట్ బ్రిడ్జి మూసివేశారు. కాగా, రేవంత్ సర్కార్ వరదలను అంచనా వేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఇది క్రిమినల్ నిర్లక్ష్యమని ఆరోపించారు.