అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. పునర్విక చికిత్స కోసం అవసరమైన ఆరు కోట్ల రూపాయలు సమకూర్చడం తన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం రూ.16 కోట్లు కావాల్సి ఉండగా.. దాతల నుంచి రూ.10 కోట్లు సమకూరాయని.. మిగతా మొత్తాన్ని అందించాలని పునర్విక తల్లిదండ్రులు నారా లోకేష్ను సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో వీడియోపై స్పందించిన నారా లోకేష్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.