సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జూన్ 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు ప్రారంభమవుతుంది. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ పర్యాటక యాత్రలో వారణాసి, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్రాజ్ వంటి పవిత్ర స్థలాలు చూడవచ్చు. రైలు భువనగిరి, కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.