వైద్యం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజులలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఫ్రీగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. అదే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. ఉచిత వైద్యంతో పాటుగా అత్యాధునిక వైద్య పరీక్షలు, సర్జరీలను కూడా ఉచితంగా అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది. 2018లో ఏర్పాటైన సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి.. 200 పడకల సామర్థ్యంతో 70 గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తోంది.