రాయలసీమ ప్రాంతానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వస్తోంది. రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం.. సోలార్, విండ్, డిఫెన్స్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ గ్రూప్ రూ.10 వేలకోట్లు పెట్టుబడులు పెడుతోంది. మంగళవారం రోజు మంత్రి నారా లోకేష్ ..సుజ్లాన్ గ్రూప్ కొత్త ఎస్ 144 విండ్ బ్లేడ్లను ప్రారంభిస్తారు.