దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించి నీట్ పరీక్షకు అమలులో ఉన్న ఒక్క నిమిషం నిబంధన ఇబ్బందిగా మారింది. ఈ కారణంగా పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. వేములవాడకు చెందిన వైష్ణవి అనే అమ్మాయి పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయింది. అధికారులు ఆలస్యమైందన్న కారణంతో పరీక్షకు అనుమతించలేదు. వైష్ణవి, ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.. పుస్తెలమ్మి తన కూతురును చదివించానని చెప్పారు. లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం లక్షా 50వేలు చెల్లించానని మహిళ తెలిపింది. కేవలం మూడు నిమిషాలు లేట్ అయ్యిందని వైష్ణవి తల్లి చెబుతున్నారు. కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల వద్ద సంఘటన జరిగింది. అటు సిద్దిపేట డిగ్రీ కాలేజ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులు లేట్గా రావడంతో అధికారులు అనుమతించలేదు.