తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ఇందులో రూ.10 లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యతనిచ్చింది. గత ప్రభుత్వ బకాయిలను తీరుస్తూ.. గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మరో రూ.85 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశంలో ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై చర్చ జరగనుంది. అదే రోజు ఎంఐఎం ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో పాతబస్తీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు.