తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (మార్చి 12న) మొదలయ్యాయి. కాగా.. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగం అనంతరం భేటీ అయిన బీఏసీ.. కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 27వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. కాగా.. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులైన బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్లపై చర్చ జరిపి ఆమోదం తెలపనున్నారు.