తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. కోడ్ ముగిసే వరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలున్నాయి. సరైన పత్రాలు లేని నగదును అధికారులు సీజ్ చేసి, ఐటీ అధికారులకు సమాచారం అందిస్తారు. ప్రజలు తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.