తెలంగాణలోని కామారెడ్డి శివారులో రైలు పట్టాలు దాటుతున్న గొర్రెల మందను వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో 90 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. ఈ ప్రమాదంలో సురేశ్ (40) అనే గొర్రెల కాపరి భయపడి పక్కనే ఉన్న వాగులో పడి గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గతంలో భువనగిరి వద్ద కూడా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొని 400 గొర్రెలు మృతి చెందాయి. రైలు పట్టాల సమీపంలో పశువులను మేపకూడదని.. భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.