తెలంగాణ ప్రభుత్వం 36 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ (గనుల శాఖ అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. రెవెన్యూ, ఇంధన, ఎస్సీ అభివృద్ధి శాఖలకు కూడా కొత్త కార్యదర్శులు వచ్చారు. హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు నూతన కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మార్పులు సుపరిపాలన, ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.