తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెంను కార్పొరేషన్గా మారుస్తూ.. పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసింది. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుత పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతకు కొత్తగూడెం కార్పొరేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. విలీన ప్రాంతాలను కలిపితే కొత్తగూడెం కార్పొరేషన్లో సుమారు నాలుగు లక్షలకు పైగా జనాభా చేరుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం సబ్-జోన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.