ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం తరచుగా ఇచ్చే రాయితీలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రాయితీలు క్రమశిక్షణారాహిత్యాన్ని పెంచుతాయని, చట్టపరమైన పరిణామాల పట్ల భయాన్ని తగ్గిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ-చలానా వ్యవస్థలో మార్పులు చేసి, ఉల్లంఘన వివరాలను స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది.