తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. వార్డుల విభజన ప్రక్రియను జూన్ 21 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ బయట ఉన్న 30 పట్టణ సంస్థల్లో విభజన.. లోపలి 13 సంస్థలను ‘జి.హెచ్.ఎం.సి.’లో విలీనం చేస్తారు. మహబూబ్నగర్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో వార్డుల సంఖ్య పెంచనున్నారు. ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించనుంది. త్వరలో రిజర్వేషన్లు ఖరారై, వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.