తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు రానున్నాయి. ఒకటో తరగతిలో చేరే పిల్లల వయసును ఆరు సంవత్సరాలకు పెంచాలని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతేకాదు.. ప్రభుత్వ బడుల్లో నర్సరీ తరగతులు కూడా మొదలుకానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లోనూ చిన్న పిల్లలకు చదువు చెప్పేందుకు కొత్త విధానం రాబోతోంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.