తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళల ఆక్యుపెన్సీ పెరగగా.. బస్సుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది. అయితే పెంచిన బస్సులకు తగిన ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం లేరు. అందుకే వారిని నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సారి నిబంధనలు మార్చుతూ.. ప్రకటన విడుదల చేసింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.