RTC Bus Ticket Fare: దసరా పండుగ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన ఛార్టీలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్యులకు తోడు పలువురు రాజకీయ నేతలు కూడా తమ గొంతు కలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. జీవో ప్రకారమే పెంచినట్టు సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.