మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన మహిళా శక్తి బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. తొలి విడతలో 150 బస్సులు ప్రారంభించగా.. వివిధ డిపోలకు 20 బస్సులను కేటాయించారు. మిగిలిన 130 బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. త్వరలోనే మరో 450 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.