మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం టీజీఆర్టీసీకి జీవం పోసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ పథకంతో ఆర్టీసీ లాభాల బాట పడుతుందని.. ఇది మహిళా సాధికారతకు చిహ్నమని పేర్కొన్నారు. కాగా, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.