ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన తల్లికి వందనం పథకం ప్రారంభించింది. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు ఏటా రూ.15000 చొప్పున ఇవ్వనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ మొత్తం జమ చేయనున్నారు. ఇందుకోసం రూ.10,091 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయితే 15 వేల రూపాయల్లో 2 వేలు ప్రభుత్వం కట్ చేయనుంది. ఈ మొత్తాన్ని పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తోంది. ఈ మొత్తం రూ.1,346 కోట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం పథకం వివరాలను సీఎం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.