తిరుపతి జిల్లా తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖి నదీ తీరంలో పడేశారు. అయితే ఈ ఆలయ స్థలంపై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. హిందూ సంఘాలు నిరసన తెలుపుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.