Tirumala Garuda seva: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు బంద్

1 year ago 56
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. అక్టోబర్ నాలుగో తేదీన ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 8న శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. మరో రెండు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సూచించారు. అలాగే గరుడసేవ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షించారు.
Read Entire Article