Tirumala Tickets: తిరుమలలో మరో మోసం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా టీటీడీ ఛైర్మన్ పీఆర్వో అని చెప్పుకుంటూ.. తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగిస్తున్నట్లు వెల్లడైంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో 600 మందిని చేర్పించి.. అందులో తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే తిరుమల టికెట్లు కావాలంటే తనను సంప్రదించాలని.. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.