Tirumala: తాను తిరుమలలో పర్యటిస్తానంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే డిక్లరేషన్ మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.