Sri Venkateswara Bhakti Channel Chairman Sridhar Varma: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్గా తిరుపతికి చెందిన టీడీపీ నేత శ్రీధర్వర్మ నియమితులయ్యారు. ఆయన పార్టీ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న శ్రీధర్ వర్మకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. శ్రీధర్ వర్మ ఎన్టీఆర్ రాజు టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ హయాంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. శ్రీధర్ వర్మ ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.