TTD EO On Employee Issues: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం, పదోన్నతులు, బదిలీలు సకాలంలో చేపట్టాలని సూచించారు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది, అమ్మవారు గజ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు.