Tirumala Murali Krishna AS TTD CVSO: తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారిగా కేవీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తిరుమలలో పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అక్రమాలకు తావు లేకుండా నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడానికి, దళారి వ్యవస్థను అరికట్టడానికి కృషి చేస్తానని తెలిపారు మురళీ.