జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ టీటీడీకి 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. తమ కంపెనీ తరుఫున టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఈవో రవిచంద్ర అభినందించారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కూడా.. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షలు విరాళంగా అందించింది.