Tirumala Applications Invite For Tiruppavai: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ధనుర్మాసంలో తిరుప్పావై ఉపన్యాసాల కోసం శ్రీవైష్ణవ పండితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో విష్ణుపరివర్తనైకాదశి, వామన జయంతి, అనంత పద్మనాభ వ్రతం, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పత్రోత్సవాలు, తిరుచ్చి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇతర ఆలయాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.