TTD E Auction Of Empty Plastic Tins On August 13: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్కు వాడిన ఖాళీ ప్లాస్టిక్ టిన్లను ఆగస్టు 13న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా, తిరుమలలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 9న తిరుమలలో గరుడ సేవను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ గరుడ సేవను టీటీడీ ట్రయల్ రన్గా నిర్వహించనుంది.