Tirupati SVIMS Hospital: స్పృహలోకి రాగానే లేడీ డాక్టర్‌పై పేషెంట్ దాడి.. అందరూ చూస్తుండగానే..

1 year ago 40
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ మీద రోగి దాడికి ప్రయత్నించాడు. అందరూ చూస్తుండగానే వార్డులో డాక్టర్ మీద దాడి చేశాడు. అయితే చుట్టుపక్కల ఉన్న వారు అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. అయితే సదరు పేషెంట్ మద్యానికి బానిసయ్యాడని.. మద్యం దొరక్క స్పృహ తప్పిపోయినట్లు తెలుస్తోంది. స్పృహలోకి రాగానే లేడీ డాక్టర్ మీద చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో స్విమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు ఆందోళనకు దిగారు. టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article