జనసేన నేత, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది. కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ తిరుపతి ప్రెస్క్లబ్లో సదరు మహిళ సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ ముగించుకుని బయటకు రాగానే జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.