తిరుమలలో ఆధ్యాత్మికత, పచ్చదనం పెంపొందించేందుకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొండల్లో పచ్చదనం పెంచేందుకు భారీగా నిధులు కేటాయించనున్నారు. తిరుచానూరు, అమరావతి, నారాయణవనం వంటి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగ తిరుమల భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడాలని మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు