టీటీడీకి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఎనర్టెక్ కామ్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ రమణరాజు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.1,00,01,116 విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి శుక్రవారం విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. ఇటీవల కూడా బళ్లారికి చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.