One Crore Donation to TTD Trusts: టీటీడీకి మరో భారీ విరాళం అందింది. ఒడిశాకు చెందిన రెండు సంస్థలు.. టీటీడీ ట్రస్టులకు కోటి రూపాయలు విరాళంగా అందించాయి. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, స్విమ్స్ ట్రస్టు, ఎస్వీ సర్వేశ్రేయాస్ ట్రస్టు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టులకు ఈ విరాళాలను అందించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి ఈ విరాళాలకు సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఏఈవో అభినందించారు.