టీటీడీ ఉద్యోగులకు శుభవార్త. టీటీడీ ఉద్యోగులు తమ పదవీ విరమణ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఈ విషయమై అధికారులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. పదవీ విరమణ రోజే వారి బ్యాంక్ ఖాతాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ జమ చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. టీటీడీ నుంచి రిటైర్ అయిన 122 మంది ఉద్యోగులకు మంగళవారం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహించారు.